విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ విజయప్రసాద్ గారు , స్థానిక నాయకులు , ఆలయ అధికారులు పాల్గొన్నారు.
